'పరువు' పోయిందా?
నాగబాబు, నరేష్ అగస్త్యా, నివేద పేతురాజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన జీ 5 ott లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ (చిత్ర భాగాల క్రమం ) పరువు. ప్రేమ - పరువు హత్య నేపధ్యం ఓ చిన్న అంశంగా తీసుకొని హత్యోదంతానికి కలిపి సస్పెన్స్ గా తీసుకొని పోవటానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంచం ఫలించింది. నాగబాబు సహాయకుడు 'చంద్ర' ని అనుకోని క్షణంలో సుధీర్ హత్య చేస్తాడు. అక్కడినుండి ఆ కధ మలుపులు తిరుగుతూ సాగుతుంది. అక్కడక్కడా కొంచం సహనాన్ని పరీక్షించిన సన్నివేశాలున్నాయి. ఆకర్షనీయమైన విషయాలు పెద్దగా లేవు. నివేదా అందం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నటన మాత్రం పాత్రలకు తగినట్టుగానే ఉన్నాయ్. రాజకీయ నాయకుడుగా రాణించారు. సాగతీతలా కొన్ని సన్నివేశాలు అనిపిస్తాయి. ముగింపు అసంపూర్ణంగా తరువాతి భాగం కోసం ఎదురు చూడాలా అన్నట్టుగా ఉంది
నటవర్గం: నరేశ్ అగస్త్య, నివేదా పేతురాజ్, నాగబాబు, రమేశ్, సునీల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, మొయీన్, రాజ్కుమార్ కసిరెడ్డి, బిందు మాధవి తదితరులు;
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్;
ఛాయాగ్రహణం: విద్యాసాగర్;
దర్శకత్వం: సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి;
-- అవ్యజ్ (శంకర్)
-- అవ్యజ్ (శంకర్)
0 కామెంట్లు
మీ కామెంట్స్ పరిశీలించబడతాయి. ఆమోదం పొందినవి ప్రచురించబడును.